ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు : మమ్ముటి

ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి. ఈ స్టార్‌ హీరో నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి . మలయాళ లాంగ్వేజ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో జ్యోతిక ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఏవనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నవంబర్‌ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో మమ్ముట్టి అండ్‌ జ్యోతిక టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా విూడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్‌ బిజీగా ఉంది మమ్ముట్టి టీం. ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పాడు మమ్ముట్టి. లోకేశ్‌కనగరాజ్‌`రజినీకాంత్‌ సినిమా కోసం విూకు కాల్‌ వచ్చిందని విన్నాం.. ఇది నిజమేనా..? అని అడిగాడు యాంకర్‌.

దీనిపై మమ్ముట్టి స్పందిస్తూ.. అవును నేను విన్నా. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు. మమ్ముట్టి ఒఅఙ (లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌) లో కనిపిస్తారా..? అని ప్రశ్నించగా.. నాకు మలయాళం సినిమా సరిపోదా..? వాళ్లు (లోకేశ్‌కనగరాజ్‌`రజినీకాంత్‌ టీం) కాల్‌ చేయనీయండి.. అప్పుడు ఆలోచిద్దామంటూ చెప్పుకొచ్చాడు మమ్ముట్టి. ఇప్పుడీ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మమ్ముట్టి ఈ ఏడాది పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఏజెంట్‌ తో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు మమ్ముట్టి.

ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఊహించని ఫెయిల్యూర్‌ టాక్‌ తెచ్చుకుంది. మమ్ముట్టి ప్రస్తుతం హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాహుల్‌ శశీంద్రన్‌ డైరెక్షన్‌లో భ్రమయుగం చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు గేమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూకలో కూడా నటిస్తున్నాడు. డీనో డెన్నిస్‌ కథనందిస్తూ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. మరోవైపు మహి వీ రాఘవ్‌ డైరెక్షన్‌లో యాత్ర సీక్వెల్‌ యాత్ర 2లో కూడా నటిస్తుండగా.. షూటింగ్‌ కొనసాగుతోంది.