అందులో ఎలాంటి వాస్తవం లేదు నమ్మండి ప్లీజ్ అంటున్న కీర్తి సురేష్..!

కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అమెరికాలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్ర బృందం లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేసుకున్నారు. కాగా ఈ సినిమా జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. థమన్ సగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ నటించబోతుందని అంటున్నారు.

Sarkaru Vaari Paata: Keerthy Suresh To Act With Mahesh Babu -  ManaTeluguMovies.net

అలాగే కోలీవుడ్ లో అన్నాతే అన్న సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తుండగా నయనతార.. ఖుష్భు కీలక పాత్రలు పోస్తున్నారని సమాచారం. మాస్ చిత్రాల దర్శకుడు శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ లో అజిత్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన శివ – రజనీకాంత్ కాంబినేషన్ అనగానే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Keerthy Suresh Is Superstar's Daughter

ఇక ఈ సినిమాతో పాటు మలయాళంలో మోహన్ లాల్ తో కూడా కీర్తి సురేష్ ఒక సినిమా చేస్తుంది. అలాగే ఇప్పటికే కమిటయిన గుడ్ లక్ సఖీ చివరి దశలో ఉందని సమాచారం. ఇవే ప్రస్తుతం కీర్తి సురేష్ అఫీషియల్ గా కమిటయిన ప్రాజెక్ట్స్. కాని గత కొంత కాలంగా కీర్తి ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన కీర్తి పదే పదే ఆ రూమర్స్ వస్తుండటంతో తాజాగా మరోసారి బాలీవుడ్ సినిమా మైదాన్ లో తాను నటించడం లేదని తేల్చి చెప్పారు. ఈ సినిమాలో నేను నటిస్తున్నానని వస్తున్న వార్తలని పూర్తిగా గాసిప్స్ అని వెల్లడించింది.