సూర్య మకాం ముంబైకి మారిందంటూ పుకార్లు

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి విూడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఆయన ముంబయికి మకాం మార్చాడు అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంతో సహా సూర్య ముంబయి వెళ్లి పోయాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. విూడియాలో వస్తున్న వార్తలకు సూర్య స్పందించలేదు. కానీ తాజాగా సూర్య ఫ్యాన్స్‌ విూట్‌ లో పాల్గొన్నాడు. ఫ్యాన్స్‌ తో చిట్‌ చాట్‌ సందర్భంగా ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది.

ఒక అభిమాని మాట్లాడుతూ విూరు ముంబయి మకాం మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అన్నట్లుగా ప్రశ్నించడం జరిగింది. ఫ్యాన్‌ ప్రశ్నకు సూర్య స్పందిస్తూ.. ముంబయికి మకాం మార్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. తన ఇద్దరు పిల్లలు కూడా చదువు నిమిత్తం ముంబయిలో ఉంటున్నారు. అప్పుడప్పుడు వారిని చూడ్డానికి మేము వెళ్తున్నాం తప్ప మేము మొత్తం ముంబయికి మకాం మార్చలేదు అంటూ సూర్య పేర్కొన్నాడు. ఈ మధ్య కాలంలో సూర్య పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వం లో కంగువ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు తమిళ సినీ ఇండస్టీ రికార్డులను బ్రేక్‌ చేయడం ఖాయం అన్నట్లుగా అంతా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే వచ్చిన టైటిల్‌ టీజర్‌, పోస్టర్స్‌ ఇంకా ఇతర వీడియోలు సినిమా పై అంచనాలు ఆకాశానికి పెంచుతున్నాయి. ఈ సినిమా తో సూర్య పాన్‌ ఇండియా రేంజ్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్టీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.