టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. ఈయన కమెడియన్ గా కొనసాగుతూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇన్ని రోజులపాటు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి ఈయన జగన్ పార్టీకి మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతం జగన్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ జనసేనకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఈయన వృత్తిపరమైన జీవితం కొనసాగుతుంది.
ఇక పృథ్వీరాజ్ వ్యక్తిగత విషయానికి వస్తే పృథ్విరాజ్ 1984 లోవిజయవాడకు చెందిన శ్రీ లక్ష్మీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. అయితే పృధ్వీరాజ్ శ్రీలక్ష్మిని మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఈమె తన భర్త నుంచి దూరంగా ఉంటున్నారు. ఇలా 2016వ సంవత్సరంలో తన భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి 2017 వ సంవత్సరంలో ఫ్యామిలీ కోర్టులో తన భర్త మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని తనతో కలిసి తాను బ్రతకలేనని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే తన భర్త నెలకు 30 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారని ఇందులో తనకు నెలకు 10 లక్షల రూపాయలు భరణంగా ఇప్పించాలని ఈమె కోర్టును కోరారు.ఇక ఈమె పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని విచారణ చేయించిన కోర్టు అనంతరం పృధ్విరాజ్ కు గట్టి షాక్ ఇచ్చింది. పృధ్విరాజ్ నెలకు ఎనిమిది లక్షల రూపాయలు తన భార్యకు భరణంగా చెల్లించాలని అది కూడా ప్రతి నెల 10వ తేదీలోగా ఈ భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు ప్రకటించింది.
