ఆ సినిమా సినిమాలకు సీక్వెల్ చేయాలని ఉంది.. పూరి కామెంట్స్ వైరల్?

Puri Jagannadh to approach Pawan Kalyan

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడి ఉంటాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎలా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో మనందరికీ తెలిసిందే.ఇకపోతే తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొట్టమొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇకపోతే యాంకర్ పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తూ మీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఏ సినిమాలు సీక్వెల్ చేయాలని ఉంది అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ మహేష్ బాబు నటించిన పోకిరి బిజినెస్మెన్ ఈ రెండు సినిమాలకు సీక్వెల్ చేయాలని ఉంది అంటూ సమాధానం చెప్పారు. ఈ రెండు సినిమాలలో మహేష్ బాబు పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని నాకు నచ్చిన ఈ రెండు సినిమాలకి సీక్వెల్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అయితే మహేష్ బాబు బిజీగా ఉండటంవల్ల కుదరలేదు ఫ్యూచర్లో తప్పకుండా ట్రై చేస్తా అంటూ ఈ సందర్భంగా ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.