భారీ ధరలకు లైగర్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ?

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో అంచనాల నడుమ తెరికెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ విడుదల అయ్యి మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేస్తుంది. ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కనీసం విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో సంతృప్తి పడలేదని తెలుస్తోంది. ఇలా థియేటర్లో విడుదలై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల కాకముందే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా 85 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని భాషలలో డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాని థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని అక్టోబర్ మొదటి వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

ఇకపోతే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ నటించారు. ఈ విధంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు.