రష్మిక బొడ్డు కోసం అన్ని లక్షలు ఖర్చుపెట్టిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన కి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. రష్మిక మందన చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులు చర్చలో దశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే రష్మిక మందన బొడ్డు కోసం ఒక టాలీవుడ్ దర్శకుడు ఏకంగా 30 లక్షల రూపాయలను ఖర్చు పెట్టాడట. ఆ దర్శకుడు ఎవరు ఎందుకు అంత ఖర్చు చేశాడు అన్న విషయానికి వస్తే.. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు రష్మిక మందన కలిసి నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అనే సాంగ్ కోసం బాగా ఖర్చు చేశారట. అందులో భాగంగానే ఈ పాటలో రష్మిక బొడ్డు కొంచెం ఎత్తుగా కనిపించిందట.

అయితే దానిని క్యూట్ గా చేయడం కోసం 30 లక్షల వరకు ఖర్చు చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడం వల్ల ఈ 30 ముప్పై లక్షలు ఖర్చు అయిందట. అయితే రష్మిక మందన కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆ బొడ్డు కోసం అన్ని లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా దర్శకుడు అనిల్ రావిపూడి కష్టానికి ఫలితంగా ఆ సాంగ్ హైలెట్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.