కార్తికేయ 2 సినిమా పై ప్రశంశలు కురిపించిన గుజరాత్ ముఖ్యమంత్రి?

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం కార్తికేయ 2. ఆగస్టు 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు క్రియేట్ చేసింది. కార్తికేయ 2 సినిమా ముందు వరకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన నిఖిల్ ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందాడు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సినీ ప్రముఖుల చేత ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల కార్తికేయ 2 చూసిన గుజరాత్ ముఖ్యమంత్రి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇటీవల కార్తికేయ2 హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ప్రత్యేకంగా కలిశారు.

ఈ క్రమంలో భూపేంద్ర భాయ్ పటేల్..ఇలాంటి దేవుళ్ళ గొప్పతనాన్ని తెలిపే మంచి సినిమాలు ఎన్నో రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మొదట ఈ సినిమా విడుదల చేయటానికి థియేటర్లు దొరకకా నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాని అతి తక్కువ సంఖ్యలో థియేటర్స్ లో విడుదల చేశారు. సినిమా మంచి పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకీ థియేటర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లు వసూలు చేసింది.

ఇప్పటికీ ఈ సినిమా అన్ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన. త్వరలోనే వీరిద్దరూ కలిసి 18 పేజెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నారు. కార్తికేయ 2 సినిమాతో హిట్ పేరుగా నిలిచిన ఈ జంట 18 పేజెస్ సినిమా ద్వారా మరొకసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి. గుజరాత్ ముఖ్యమంత్రి సినిమా మీద ప్రశంసలు కురిపించడంతో కార్తికేయ 2 చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.