రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో ‘తండేల్‌’!

టాలీవుడ్‌లో త్వరలో సందడి చేయబోతున్న క్రేజీ కాంబోల్లో ఒకటి అక్కినేని నాగచైతన్య -చందూ మొండేటి. తాజాగా ఈ ఇద్దరూ రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో ‘తండేల్‌’ మూవీ చేస్తున్నారని తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుడ్‌ భామ సాయిపల్లవి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో చైతూ మాస్‌ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. లైట్స్‌ ఆన్‌.. స్టార్ట్‌ కెమెరా.. యాక్షన్‌ అంటూ ‘తండేల్‌’ షూటింగ్‌ మొదలుపెట్టేసింది చైతూ టీం.

నాగచైతన్య, ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ‘తండేల్‌’లో లవ్‌స్టోరీ తర్వాత చైతూ, సాయిపల్లవి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది.

ఇప్పటికే తెలంగాణ యాసలో వినోదాన్ని పంచిన సాయిపల్లవి.. ఈ సారి శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్‌ గాళ్‌గా ఎలా అలరిస్తుందనేది చూడాలి మరి. 2018లో గుజరాత్‌ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం వస్తున్నట్టు సమాచారం. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌ టాక్‌.

తండేల్‌కు అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. టాప్‌ బ్యానర్‌ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. కార్తికేయ, సవ్యసాచి, కార్తికేయ 2, ప్రేమమ్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూమొండేటి నుంచి వస్తున్న సినిమా కావడం.. శ్రీకాకుళం బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.