గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘తెప్ప సముద్రం’ ఆగస్ట్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించిన మూవీ తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 3 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ చేస్తోంది.

ఎంగేజింగ్ కంటెంట్ తో తెరకెక్కిన ‘తెప్ప సముద్రం’ ఈ వీకెండ్ ఆహా ఓటీటీ లో తప్పకుండా చూడాల్సిన చిత్రం.