మెగాస్టార్ కి అక్కడ గౌరవం దక్కింది మరిక్కడ??

ప్రస్తుత తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర వన్ అండ్ ఓన్లీ ప్రైడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకున్న ఘనత కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా రీసెంట్ గా తనకి వచ్చిన అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ విషయంలో మెగా ఫ్యాన్స్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో గర్వపడ్డారు.

అలా టాలీవుడ్ సహా అనేకమంది రాజకీయ నాయకులూ కూడా మెగాస్టార్ ని కలిసి ఆయనకి శాలువా కప్పి గౌరవ మర్యాదలు అందించారు. ఇక తాజాగా తెలంగాణా సరికొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరుని స్వయంగా కలిసి ఆయనకి గాను పద్మ విభూషణ్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా అయన కోసం చిన్న ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి.

సరే ఇది బాగానే ఉంది కానీ తెలంగాణాలో చిరు కి అక్కడి ప్రభుత్వం స్పందించి ఎంతో గౌరవాన్ని అందించింది. మరి చిరు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సమానమైన క్రేజ్ ఉంది. ఇక ఏపీలో అయితే ఇంకా ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన పక్కన పెడితే కనీసం శుభాకాంక్షలు కూడా వచ్చినట్టు లేవు.

మరి ఏపీలో జగన్ గవర్నమెంట్ చిరుకి ఏమన్నా సత్కరించేది ఉందా లేదా అనేది చూడాలి. ఇది వరకే మెగా ఫ్యాన్స్ అప్పట్లో చిరుని జగన్ తన దగ్గరకి పిలిపించుకొని అవమానించాడు అని కాస్త గుస్సాగానే ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసే ఛాన్స్ ఉంది.