టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్గా సంచలన విజయం సాధించిన తర్వాత ఈ నగరానికి ఏమైందితో మరోసారి డిఫరెంట్ ప్రయత్నం చేశారు. ఆ సినిమా కంటెంట్ పరంగా ప్రశంసలు పొందినా, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలవలేకపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకుని కీడా కోలా తీసినా, వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం ఆయన నటుడిగా కూడా బిజీగా ఉన్నారు. తాజాగా మలయాళ సూపర్ హిట్ జయ జయ జయహే రీమేక్గా ఓం శాంతి సినిమాతో ముందుకొస్తున్నారని వార్తలు ఉన్నాయి. అదే సమయంలో ఈ నగరానికి ఏమైంది 2 కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్న సమాచారం కూడా వినిపిస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్లో హీరోగా విశ్వక్ సేన్ పేరు చర్చల్లో వినిపించింది, కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు.
ఇక కొత్తగా వచ్చిన టాక్ ప్రకారం, తరుణ్ భాస్కర్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి కొత్త సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా జీఏ 2 పిక్చర్స్ బ్యానర్పై రూపొందనుందని, టైటిల్గా బినామీ ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. ఇది పక్కా ఎంటర్టైనర్గా ఉండనుందని టాక్. తరుణ్ భాస్కర్ ఎందుకు విశ్వక్తో ఉన్న సీక్వెల్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి విజయ్ ప్రాజెక్ట్కి ప్రాధాన్యం ఇచ్చాడోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజానికి ఇద్దరు హీరోలూ బిజీగా ఉన్నా, విజయ్ ప్రాజెక్ట్ ముందు జరగాలనే నిర్ణయం వెనక నిర్మాతల ప్రెజర్ ఉందా? అనేది తెలియలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.