‘ఎ’ సర్టిఫికెట్‌ను ప్రమోట్‌ చేస్తున్న ‘తంత్ర’ టీమ్‌!?

ఏ దర్శకనిర్మాత అయినా.. తమ సినిమా అందరూ చూడాలని కోరుకుంటారు. కానీ.. ఈ దర్శకనిర్మాతలు ముందే వార్నింగ్‌ ఇస్తున్నారు. కారణం.. ఈ సినిమాకు వచ్చిన సెన్సార్‌ సర్టిఫికేట్‌ అలాంటిది మరి. తమ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్‌ రావడంపై ‘తంత్ర’ టీమ్‌ వెరైటీగా రియాక్ట్‌ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ ‘ఎ’ ని పెద్దగా హైలైట్‌ చేస్తూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్‌ ప్రమోషనల్‌ స్ట్రాటజీ అని చెప్పుకోవాలి.

అలానే తమ సినిమా మంచి హర్రర్‌ ఎలిమెంట్స్‌తో థ్రిల్‌ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్‌.. చిన్నపిల్లలు రావద్దని వారిస్తూ.. వార్నింగ్‌ ఇస్తున్నారు. ఈ ప్రమోషనల్‌ స్ట్రాటజీ నిజంగానే మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ వార్నింగ్‌.. అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది.

ఇప్పటికే రిలీజైన్‌ చిత్ర టీజర్‌, సాంగ్స్‌ మంచి స్పందన రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్‌ వదిలిన వార్నింగ్‌ పోస్టర్‌ మరింతగా.. ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. హీరోయిన్‌ అనన్య నాగళ్ల ప్లలెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. ‘ధీరే ధీరే’ సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్‌ రఘుముద్రి ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణకానున్నాడు.

వీరే కాకుండా ‘మర్యాదరామన్న’ ఫేం సలోని, టెంపర్‌ వంశీ, విూసాల లక్ష్మణ్‌ ఈ హార్డ్‌హిట్టింగ్‌ హర్రర్‌ డ్రామాకి తమదైన గాఢతని తీసుకొచ్చారని దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టి తెలుపుతున్నారు. మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన ఈ దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని ‘తంత్ర’తో సాధించారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్‌ బాబు, రవి చైతన్య తెలిపారు.