తనికెళ్ల భరణి సందేశాత్మక చిత్రం.. నిర్ణయం

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు తనికెళ్ల భరణి మరో సందేశాత్మక చిత్రంతో రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘నిర్ణయం’. ఈ సినిమాతో సంజయ్‌ కుమార్‌, అంజలి హీరోహీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. జెన్నీ, పీవీ కృష్ణ ప్రసాద్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ ఫిల్మ్‌ ఛాంబర్‌ లోని థియేటర్‌ లో ప్రివ్యూ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు మూవీ బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘నిర్ణయం’తో గతంలో అక్కినేని నాగార్జున యాక్షన్‌ ఫిల్మ్‌ వచ్చింది.

మళ్లీ ఇప్పుడు అదే టైటిల్‌ తో ఈ చిత్రం వస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు భరణి చెప్పుకోచ్చాడు. శివరావు సత్తెనపల్లి సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో ‘బాహుబలి’ హరిశ్చంద్ర రాయల, రఘునాథ రెడ్డి, జనార్ధన్‌ రావు (జెన్నీ) కీలక పాత్రల్లో నటించారు. సుద్దాల అశోక్‌ తేజ, కుల శేఖర్‌ ఈ సినిమాకు పాటలు అందించగా.. కృష్ణ సాయి సంగీతం అందించారు. త్వరలోనే చిత్రయూనిట్‌ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేయనుంది.