అజిత్‌ తాజా చిత్రం ‘విడాముయర్చి’

తమిళ స్టార్‌ నటుడు అజిత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ’విడాముయర్చి’. ఏకే 62గా వస్తున్న ఈ సినిమాకు మగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. ఎంత వాడు గాని తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రానుండటంతో మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ వస్తుందా? అజిత్‌ లుక్‌ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి గుడ్‌ న్యూస్‌ అందిస్తూ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.

ఇక ఈ ఫస్ట్‌ లుక్‌ ప్రస్తుతం నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. కోలీవుడ్‌ టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, రెజీనా కసాండ్రా, అరవ్‌ కిజర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు.