స్వీటీ ఫ్యాన్స్ ఇది టూ మచ్ అమ్మా… 

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లేటెస్ట్ గా వచ్చి మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని హిట్ అయ్యిన చిత్రాల్లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అలాగే అనుష్క శెట్టి కాంబినేషన్ లో దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కూడా ఒకటి.

మరి ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు రాబడుతుంది. అలాగే మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు నమోదు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ చిత్రం విషయంలో అయితే ఇప్పుడు స్వీటీ అనుష్క ఫ్యాన్స్ టోటల్ క్రెడిట్ అనుష్క కె దక్కుతుంది అని సోషల్ మీడియాలో అంటున్నారు.

సినిమా వసూళ్లు అంతా ఒక్క అనుష్క స్టార్ పవర్ తోనే వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పాలి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇండియాలో యూఎస్ లో కూడా నవీన్ ఎంతో కష్టపడి ప్రమోట్ చేసాడు. అంతే కాకుండా తన కామెడీతో అందరికీ ఎంటర్టైన్ చెయ్యాలని చూసాడు.

కానీ అనుష్క ఒక్క ఈవెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా కనిపించలేదు తీరా సక్సెస్ అయ్యాక సినిమా క్రెడిట్ అంతా అనుష్క కే దక్కుతుంది అని ప్రచారం చేయడం మాత్రం చాలా టూ మచ్ అనే చెప్పాలి. ఎంతమంది స్టార్స్ ఉన్నా కూడా సినిమాలో విషయం లేకపోయినా సరైన ప్రమోషన్స్ లేకపోయినా అది తేలిపోతుంది. దానిని హీరో దర్శకుడు బాగా హ్యాండిల్ చేస్తే క్రెడిట్ మాత్రం అనుష్క ఒక్క దానికే అంటే ఎలా?