తేజ చిత్రం సీక్వెల్ తో సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ .. మళ్ళీ అందరూ కలిశారు..ఇక ఇండస్ట్రీ హిట్ పక్కా..!

తేజ చిత్రం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి గ్రేట్ టెక్నీషియన్ గా పాపులారిటీని తెచ్చుకున్న తేజ దర్శకుడిగా మాత్రం తెలుగు ఇండస్ట్రీకి రావడం గొప్ప విషయం. అంతేకాదు టాలీవుడ్ సినిమాకి కాజల్ అగర్వాల్, ఉదయ్ కిరణ్, రీమా సేన్, సదా, నితిన్, నవదీప్..ఇలా ఎంతో మంది హీరో, హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులను పరిచయం చేశాడు. తేజ పరిచయం చేసిన వాళ్ళలో దాదాపు అందరూ స్టార్ హోదా ని దక్కించుకున్నారు.

ఇక తేజ డెబ్యూ సినిమా చిత్రం సెన్షేషనల్ హిట్ అందుకుంది. అంతేకాదు నిర్మాత రామోజీ రావుకి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఆర్ పి పట్నాయక్, కులశేఖర్, రసూల్.. ఇలా ఎంతో మంది టెక్నీషియన్స్ ని .. దర్శకులని పరిచయం చేశాడు. ఇక తేజ కెరీర్ లో ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ ఉండటం విశేషం. స్టార్స్ కోసం వేయిట్ చేయని దర్శకులలో తేజ ముందుంటాడు. ఆడిషన్స్ నిర్వహించి కొత్త టాలెంట్ ని తీసుకు రావడం లో తేజ తర్వాతే ఎవరైనా.

ఇక తేజ చిన్న గ్యాప్ తర్వాత రానా, గోపీచంద్ లతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలని చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ‘రాక్షస రాజు రావణాసురుడు’, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అన్న టైటిల్స్ తో ఈ రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు తేజ. ప్రస్తుతం ఈ సినిమాలకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా ఈరోజు తేజ బర్త్ డే సందర్భంగా చిత్రం సినిమా సీక్వెల్ ‘చిత్రం 1.1’ ని ప్రకటించాడు. ఈ సినిమాకి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుండగా ‘చిత్రం మూవీస్’,’ఎస్ స్టూడియోస్’ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక మరోసారి తేజ కొత్త వాళ్లని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు.