సూర్య మళ్ళీ పాత స్టైల్ లోనే.. ?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ కాంబినేషన్ లో హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్ లో హాట్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ మూవీ పూర్వ జన్మల నేపధ్యంలో ఉంటుందనే మాట వినిపిస్తుంది. రెండు భిన్నమైన నేపధ్యాలని ఈ మూవీలో చూపించాబోతున్నారు.

అలాగే సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 7 సెన్స్ తరహా కథాంశంతో ఉంటుందనే మాట వినిపిస్తుంది. 1678లో ఒక మహారాజు అంతుచిక్కని వ్యాధితో చనిపోతాడు. అయితే ఆ వ్యాధి సాధారణంగా వచ్చింది కాదని ప్రస్తుత కాలంలో ఉన్న ఒక అమ్మాయి అతని అస్తికలపై రీసెర్చ్ చేసి గుర్తిస్తుంది. అదొక ప్రమాదకరమైన వైరస్ కారణంగా అతని మరణం సంభవించింది అని గుర్తిస్తుంది. ఆ వ్యాధిని ఆ వారియర్ కింగ్ కి ఎలా సోకింది. దానిని అతనిపై ప్రయోగించిన వారు ఎవరు? ఎందుకు చేశారు అనే అంశాలని కథలో భాగంగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగానే మరల చనిపోయిన వారిన పునర్జన్మ ఎత్తి తన మరణానికి సంబందించిన రహస్యాన్ని అమ్మాయి సహాయంతో ఎలా తెలుసుకున్నాడు అనే ఎలిమెంట్ ప్రధానంగా కంటెంట్ లో దర్శకుడు శివ చూపించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా కోసం కథని బట్టి రెండు భిన్నమైన నేపధ్యాలలో కథాంశం చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎలిమెంట్ చూసుకుంటే సూర్య 7సెన్స్ మూవీకి కాస్తా దగ్గర పోలికలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకి సీక్వెల్ లా ఉంటుందా అనే డౌట్ తెరపైకి వచ్చింది. ఇక ఈ మూవీ కోసం భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ని దర్శకుడు శివ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సూర్యని కూడా చాలా పవర్ ఫుల్ గా వారియర్ లుక్ లో ప్రెజెంట్ చేయనున్నాడు. అన్ని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.