ప్రిన్స్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన రాబోయే చిత్రం గురుంచి ప్రకటన చేశారు. పరశురం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “సర్కారు వారి పాటా” అనే టైటిల్ ఖరారు చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు తన రాబోయే చిత్రం సర్కారు వారీ పాటా నిర్మాతలను (మైత్రి మూవీస్) యుఎస్ లో జరగనున్న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ కోసం షూటింగ్ సిబ్బందిని వీలైనంత వరకు తగ్గించాలని ఆదేశించారట. కోవిడ్ -19 వల్ల తన షూటింగ్ షెడ్యూల్ ఏవిధంగా కూడా ఇబ్బంది జరగకూడదని సూపర్ స్టార్ భావిస్తున్నాడు. అంతే కాకుండా అమెరికాలో జరిగే షెడ్యూల్లో కూడా అక్కడ లోకల్ యుఎస్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా సెట్లో సాధ్యమైనంత తక్కువ మంది వుండేటట్టు చూడమని కోరాడట.
ఇటీవల 2 రోజుల క్రితం కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో మహిళా కథానాయికగా నటించడానికి మహానటి స్టార్ ను ఫైనల్ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సాంకేతిక సిబ్బందిలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఉన్నారు.
మహేష్ బాబు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాతో కలిసి చేయవలసిన ఒక ప్రాజెక్ట్ పైప్లైన్లో ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.