‘హనుమాన్’ దర్శకుడి వెంట పడుతున్న అగ్రహీరోలు.!

సినిమా తీశాడు, దాన్ని విడుదల చేసుకోవడానికి నానా తంటాలూ పడ్డాడు.! అయితేనేం, రెండొందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు రాబట్టింది అతను తెరకెక్కించిన సినిమా. అదే ‘హనుమాన్’.! ఆ దర్శకుడు ప్రశాంత్ వర్మ.

టాలీవుడ్‌లో ఇప్పుడు ప్రశాంత్ వర్మ హాట్ టాపిక్ అయిపోయాడు.! ‘జై హనుమాన్’ అంటూ, ‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నాడు. 2025లో ఈ సినిమా వుంటుందట. ఈలోగా ప్రశాంత్ వర్మ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయ్.

అయితే, ప్రస్తుతం పలువురు అగ్రహీరోలు ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి క్యూ కట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఓ టాలీవుడ్ యంగ్ హీరో, ప్రశాంత్ వర్మని పిలిపించుకుని, చర్చలు జరిపాడని తెలుస్తోంది.

ఓ పెద్ద నిర్మాణ సంస్థతో తనకు అనుబంధం వుందనీ, బడ్జెట్ పరిమితులేమీ లేవనీ, పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకటి చేద్దామనీ, సదరు యంగ్ హీరో, ప్రశాంత్ వర్మకి చెప్పాడట. అయితే, ప్రశాంత్ వర్మ నుంచి ఏం సమాధానం వచ్చిందన్నది ఇంకా తెలియరాలేదు.

సక్సెస్ ఇచ్చే కిక్కు ఇలాగే వుంటుంది మరి. అన్నట్టు, ప్రశాంత్ వర్మకి రికార్డు స్థాయి రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట పలువురు ప్రముఖ నిర్మాతలు.. తమ బ్యానర్‌లో సినిమా చేయమని కోరుతూ.