‘పుష్ప-2’ కోసం సుకుమార్ ‘మెగా’ స్కెచ్.!

సుకుమార్ అంటే మాస్టర్ ఇన్ స్టోరీ టెల్లింగ్.. ఈ విషయం కొత్తగా చెప్పేదేముంది.? ‘పుష్ప ది రైజ్’ సినిమాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు, ఈసారి ప్రపంచం దృష్టిని ‘పుష్ప టు ది రూల్’ సినిమాతో సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సహా పలు ఇతర భాషల్లోనూ ఒకేసారి సినిమా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

ఇదిలా వుంటే, ఈ సినిమాకి మరింత ‘మెగా’ క్రేజ్ తెచ్చేందుకోసమా.? అన్నట్లు దర్శకుడు సుకుమార్ రకరకాల వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘పుష్ప 2 ది రూల్’ కోసం మెగాస్టార్ చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించాలనే ఆలోచనలో వున్నాడట దర్శకుడు.

మెగా వర్సెస్ అల్లు.. అంటూ, గత కొంతకాలంగా కొందరు దురభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అటు అల్లు అర్జున్, ఇటు మెగా కాంపౌండ్‌కి చెందిన ఇతర హీరోలు ప్రయత్నిస్తున్నా.. సోకాల్డ్ దురభిమానులు మాత్రం తమ రచ్చ కొనసాగిస్తూనే వున్నారు.

ఈ నేపథ్యంలో, ‘పుష్ప 2 ది రూల్’కి మెగా వాయిస్ ఓవర్ చేయిస్తే, వివాదం పూర్తిగా చల్లారిపోతుందనే భావించొచ్చు. చిరంజీవి, వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొత్త కాదు. పైగా, చిరంజీవి అభిమానిగా చెప్పుకునే అల్లు అర్జున్, మెగాస్టార్ వాయిస్ ఓవర్ అనగానే ఎగిరి గంతేస్తాడు తప్ప, అబ్జెక్ట్ చేసే ప్రసక్తే వుండదు.

చూద్దాం.. ఈ ప్రచారంలో నిజమెంతో.!