ఫిబ్రవరి 2న బ్యాండ్‌ మేళం!

సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ’అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ కు రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది. ఈ సినిమాలో మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్‌ కనిపించనున్నారు. ’అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌, దర్శకుడు వెంకటేష్‌ మహా బ్యానర్‌ మహాయన మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ ’అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుపుతూ ఓ ఆసక్తికరమైన పిక్‌ని మేకర్స్‌ వదిలారు. ఈ పిక్‌లో గుండుతో ఉన్న సుహాస్‌.. అద్ధం ముందు నిలబడినట్లుగా చూపించారు.

అయితే అద్దంలో మాత్రం జుట్టుతో ఉన్నట్లుగా కనిపిస్తుండటం చూస్తుంటే.. ఇదే సినిమాకు కీ పాయింట్‌ అనేది అర్థమవుతోంది. వైవిధ్యమైన కథా కథనాలతో తెరకెక్కిన ఈ ’అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా థియేటర్స్‌లో ఆడియెన్స్‌కు యూనిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.