“శాకుంతలం” బిజినెస్ ఫేక్ వార్తలపై స్ట్రాంగ్ క్లారిటీ.!

Shaakuntalam

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతున్న పీరియాడిక్ విజువల్ వండర్ సినిమా “శాకుంతలం” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో భారీ విజువల్స్ తో తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరకు వస్తుండగా అన్ని ప్రాంతాల్లో బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కాగా ఈ సినిమాపై కొన్ని వెబ్ సైట్ లు అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేయడాన్ని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాణ సంస్థ దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు కూడా ఖండించారు.

అసలు శాకుంతలం బిజినెస్ విషయంలో మీరు చెప్పింది అంతా పచ్చి అబద్దం అని మా బిజినెస్ ని ఇలాంటి వార్తలతో చంపొద్దు అంటూ యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారు క్లారిటీ ఇచ్చారు. దీనికి గాను ఈ వార్తలు నిజం అంటూ దిల్ రాజు నిర్మాణ సంస్థ కూడా దానిని రీట్వీట్ చేసింది.

అయితే ఇదే తప్పుడు వార్త ప్రచారం చేసిన సంస్థకి గత కొన్ని రోజులు కితమే సమంత కూడా చెంప చెళ్ళుమనించే రిప్లై ని తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వార్తలు ప్రచారం చేసినందుకు గాను ఇచ్చింది. అయినా కూడా సమంత సినిమాపై వారు ఆపడం లేదు. దీనితో సామ్ ను కావాలనే టార్గెట్ చేసారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో 3డి లో ఈ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.