చిరంజీవి సరసన త్రిష.! రీజన్ అదే.!

మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో ‘స్టాలిన్’ సినిమా వచ్చింది. ఆ తర్వాత ‘ఆచార్య’ కోసం ఈ ఇద్దరూ జతకట్టాల్సి వుంది. చివరి నిమిషంలో ఆ పాత్రలోకి కాజల్ అగర్వాల్ వచ్చింది.

అనూహ్యంగా కాజల్ అగర్వాల్ నటించిన పోర్షన్ మొత్తం లేపేశారు ‘ఆచార్య’ సినిమాలో. అటు త్రిషకీ, ఇటు కాజల్ అగర్వాల్‌కీ ఒప్పందాల ప్రకారం చెల్లింపుల్లో ఇబ్బందులేమీ కలిగించలేదు.

త్రిష విషయంలో అయితే, చిరంజీవి స్పెషల్‌గా ఒప్పించారట. దర్శకుడి మీద మాత్రం త్రిష ఇప్పటికీ గుర్రుగానే వుంటుందనుకోండి. అది వేరే సంగతి. తాజాగా త్రిష – చిరంజీవి కాంబినేషన్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యింది.

మాటకు కట్టుబడి చిరంజీవి, త్రిషకి తన తదుపరి సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాజల్ కూడా ఈ సినిమాలో నటించవచ్చునంటున్నారు. ఆగస్టులో సినిమా ప్రకటన రావొచ్చు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి. దర్శకుడి మార్పు కూడా వుండొచ్చని సమాచారం.