డబుల్ ఇస్మార్ట్.! రష్మికని తీసుకొస్తారట.!

పూరీ జగన్నాధ్ – రామ్ పోతినేని కాంబినేషన్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయమై టాపిక్ బయటికొచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

మొదటి పార్ట్‌లో నిధి అగర్వాల్, నభా నటేష్ నటించారు. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు ఫేడవుట్ అయిపోయారు. మార్కెట్ అస్సలు లేదీ ముద్దుగుమ్మలకు. అన్నట్లు నభా నటేష్‌ని మొదటి పార్ట్‌లో చంపేశారు కాబట్టి.. ఈ పార్ట్‌లో అస్సలు ఛాన్సే లేదు.

కానీ, నిధి అగర్వాల్‌కి కొద్దో గొప్పో ఛాన్సుంది. కానీ, ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రష్మిక మండన్నాని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్లు తాజా ప్రచారం. రష్మికను మెయిన్ లీడ్ హీరోయిన్‌గా తీసుకుని, నిధి అగర్వాల్‌కి గెస్ట్ అప్పియరెన్స్‌లో కొన్ని నిముషాల నిడివి వుండే పాత్రను ఇవ్వబోతున్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. చూడాలి మరి ఏం జరుగుతుందో.