కన్ఫూజన్‌లో SSMB 28 టీమ్

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 28 వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరియర్‌లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయకపోవడంతో మహేష్ బాబు 28 అనే పేరుతో సంబోధిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చిన్నబాబు నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ 2023వ సంవత్సరంలో రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ ముందు నుంచి చెబుతోంది. అప్పటికి కచ్చితంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేస్తామని నమ్మకం అయితే ఉంది. సినిమా అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన తర్వాత ఏడు నెలలుగా ఈ సినిమా ప్రహసనం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ కి సినిమా రిలీజ్ చేయగలదా లేదా అనే విషయం మీద సినిమా యూనిట్ తర్జన భజనలు పడుతుందని తెలుస్తోంది.

కొద్ది వారాల క్రితం ఈ సినిమా యూనిట్ షూటింగ్ జూలై లోపు పూర్తి చేయలేమని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టులో సినిమాని రిలీజ్ చేయడం కంటే వాయిదా వేసి సంక్రాంతికి రిలీజ్ చేయడం బెటర్ అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ 15వ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ తో పోటీ విషయంలో సినిమా యూనిట్ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఇప్పటికే దిల్ రాజు.. రామ్ చరణ్ 15 సినిమాని సంక్రాంతి 2024 కి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని గతంలో ప్రకటించారు. దానికి తోడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమా కూడా అప్పుడే రావాలని ఫిక్స్ అయింది. ఒకవేళ ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ లేట్ అయ్యి సినిమా రిలీజ్ వాయిదా వేసిన మరో రెండు పెద్ద సినిమాల డేట్ లో అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకటి ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసి మాట నిలబెట్టుకోవాలి లేదా సంక్రాంతికి వెళ్లి పెద్ద హీరోలతో పోటీ పడాలని అర్థం కాక సినిమా యూనిట్ తల పట్టుకున్నట్లుగా చెబుతున్నారు.