” సర్కారు వారి పాట ” నుంచి సాలీడ్ అప్‌డేట్…!

భరత్ అనేనేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరస బ్లాక్ బస్టర్స్ తో అంతకంతకి తన రేంజ్ అండ్ మార్కెట్ ని పెంచుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘సర్కారు వారి పాట’ అన్న సినిమాలో నటించబోతున్నాడు. సొంత బ్యానర్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది.

Happy Birthday Mahesh Babu: 'Sarkaru Vaari Paata' motion poster is out and  it's exciting

పరశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాజా అప్‌డేట్ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇస్తోంది. నవంబర్ నుంచి సర్కారు వారి పాట ని మొదలుపెట్టబోతున్న మేకర్స్ ఇప్పటికే యూఎస్ వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. డైరెక్టర్ పరశురామ్ – సినిమాటోగ్రాఫర్ మధి – ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాష్ లు లొకేషన్స్ చూస్తున్నట్టు తాజా సమాచారం. అంతేకాదు ‘సర్కారు వారి పాట’ ఫారిన్ షెడ్యూల్ 45 రోజులు ప్లాన్ చేశారట. ఒకే ఒక్క సింగిల్ షెడ్యూల్ ని ప్లాన్ చేసి ఏకాధాటిగా చిత్రీకరణ జరిపి 50 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని పక్కా ప్రణాళిక రచించనున్నారట. ఈ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు రెండు సాంగ్స్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వస్తారని తెలుస్తుంది.

ఇక మిగిలిన 50 శాతం టాకీపార్ట్ అండ్ సాంగ్స్ ని ఇక్కడ సెట్స్ లో కంప్లీట్ చేస్తారట. మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో సమ్మర్ అంటే.. జూన్ లేదా జూలై మొదటి వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ న్యూస్ తెలియడంతో ఫ్యాన్స్ ఇంత త్వరగా 50 శాతం షూటింగ్ ఫినిష్ కాబోతుందా అంటూ షాకవుతున్నారట.