“యాత్ర 2”..మమ్ముట్టి రాక తన రెమ్యునరేషన్ పై అప్డేట్

గత ఎన్నికల సమయంలో అయితే ఏపీలో రెండు పొలిటికల్ పార్టీలు కూడా తమ అనుబంధ సినిమాలు విడుదల చేసుకోగా వాటిలో స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై చేసిన చిత్రం “యాత్ర” కూడా ఒకటి. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం అయితే బయోపిక్ చిత్రాల్లో ఓ మంచి హిట్ గా కూడా నిలిచింది.

కాగా మళ్ళీ ఈసారి ఎన్నికలకి అయితే ఈ చిత్రం సీక్వెల్ యాత్ర 2 ని రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈసారి సినిమాని మాత్రం మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈసారి వై ఎస్ జగన్ పాత్రపై చేస్తుండగా ఈ సినిమా మళ్ళీ మహి వి రాఘవ్ నే దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా మొదటి చిత్రంలో అయితే వై ఎస్ పాత్రని మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి నటించగా ఈసారి సినిమాలో అయితే జగన్ పాత్రని యంగ్ హీరో జీవా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఐతే ఇద్దరు కూడా నటించనున్నారు. మరి ఈ చిత్రంలో అయితే ఇపుడు మమ్ముట్టి పై కూడా కొన్ని సీన్స్ చేయాల్సినవి ఉన్నాయట.

అందుకే తన షూటింగ్ నిమిత్తం తాను ఈ సెప్టెంబర్ 20 నుంచి షూట్ లో జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఈసారి ఈ చిత్రానికి మమ్ముట్టి షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నారట. కాగా తాను చేసేది తక్కువ రోజులు షూటింగ్ అయినప్పటికీ రోజుకి దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల మేర ఛార్జ్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో మమ్ముట్టి రెమ్యునరేషన్ కూడా మాములు లెవెల్లో లేదని చెప్పాలి.