సమంతని చూసి కన్నీళ్లు పెట్టుకున్న శోభిత

బాలీవుడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ళ. ఈ అమ్మడు అచ్చమైన ఆంధ్రా అమ్మాయి. శోబిత ఫ్యామిలీ అంతా విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. ఇక ఎడ్యుకేషన్ పూర్తయ్యాక అందాల పోటీలకి వెళ్ళిన ఈ బ్యూటీ అక్కడి నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది.

తాజాగా హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేసింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా శోభిత అక్కినేని నాగ చైతన్యతో డేట్ లో ఉందనే ప్రచారం నడుస్తుంది. ఒకటి, రెండు సార్లు వీరిద్దరూ కలిసి కెమెరాలకి చిక్కారు. దీంతో ఈ పుక్కార్లు నిజమనే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటికి అటు చైతన్య కాని, ఇటు శోభిత కాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

అయితే సడెన్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. సమంతని అలా చూసి భావోద్వేగానికి లోనయ్యాను అని పేర్కొంది. సమంత ప్లేస్ లోకి రావడానికి ట్రై చేస్తున్న శోభిత ఆమె గురించి ఎందుకు బాధపడుతుంది అని అందరూ భావించారు. నిజానికి శోభిత ప్రస్తావించింది హీరోయిన్ సమంత గురించి కాదు. ఆమె చెల్లెలు సమంత గురించి.

తాజాగా విశాఖపట్నంలో చెల్లెలు సమంత వివాహ వేడుక జరిగింది. ఇందులో ఆమె పాల్గొని సందడి చేసింది. ఫ్యామిలీ, బంధువులు అందరితో కలిసి సరదాగా గడిపింది. వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సమంతని పెళ్లి కూతురుగా చూసేసరికి భావోద్వేగానికి లోనయ్యాను. కన్నీళ్లు ఆగలేదు. ఈ పెళ్లిలో భాగా ముస్తాబు కావాలని అనుకున్న కాని పెళ్లి పనుల్లో బిజీ కావడంతో పెద్దగా రెడీ కాలేకపోయాను.

సంగీతం ఎంతో సందడిగా జరిగింది. బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశా. ఈ అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని శోభిత పేర్కొంది. ఇప్పుడు ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ మొత్తం చదివిన తర్వాత శోభిత చెబుతుంది హీరోయిన్ సమంత గురించి మాత్రం కాదని నెటిజన్లుకి క్లారిటీ వస్తుంది.