ఇంకోసారి చిరంజీవితో శృతిహాసన్.!

శ‌ృతిహాసన్‌ని తీసుకోవాలా.? మృనాల్ ఠాకూర్ అయితే బావుంటుందా.? అనుష్క అయితే ఎలా వుంటుంది.? ఇలా రకరకాల ప్రశ్నలు ‘మెగా 156’ టీమ్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట.

దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో చిరంజీవి ప్రధాన పాత్రలో వశిష్ట (బింబిసార ఫేం) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం వెతుకులాట షురూ అయ్యింది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వెతుకులాట శృతిహాసన్ దగ్గరకు వచ్చి ఆగినట్లు తెలుస్తోంది. మృనాల్ ఠాకూర్ పేరు కూడా పరిశీలనలో వుంది. అయితే, శృతిహాసన్‌ని ఓ స్పెషల్ రోల్ కోసం తీసుకుంటారరన్న వాదన కూడా వినిపిస్తోంది.

ముల్లోకాల బ్యాక్‌డ్రాప్‌తో సినిమా తెరకెక్కుతోంది గనుక, ఫిమేల్ లీడ్స్ వెరీ వెరీ స్పెషల్‌గా వుండాలన్నది టీమ్ యోచనగా కనిపిస్తోంది. ఓ దశలో అనుష్క పేరు కూడా ప్రస్తావనకు వచ్చినా, ‘ఆమెతో కష్టం..’ అనే భావన కూడా చర్చకు వచ్చిందట.

కాగా, చిరంజీవి – శృతిహాసన్ కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు. ఇద్దరి మధ్యా రొమాంటిక్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పాటలైతే మరీనూ.! సూపర్ హిట్ కాంబినేషన్ అన్న కోణంలో శృతిహాసన్‌ని రిపీట్ చేస్తారా.?

లేదంటే, కొత్తగా ట్రై చేయాలన్న ఆలోచనతో మృనాల్ ఠాకూర్‌కి ఛాన్సిస్తారా.? వేచి చూడాల్సిందే.