శ్రుతి హాస‌న్ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి!

Shruthi Hassan

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రతేకతను చాటుకున్న తార శ్రుతి హాస‌న్ కు మళ్లీ  ఆశలు చిగురిస్తున్నాయట. తాజాగా ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని సినిమా ‘క్రాక్‌’ లో నటిస్తూనే మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Shruthi Hassan

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’ షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. ఈ చిత్తానికి సంబంధించి  హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో  ప్ర‌త్యేకంగా వేసిన ఒక సెట్లో  చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.  

ఇన్నాళ్లు టాలీవుడ్ కు ఎందుకు దూరమైందో ఆమెకే తెలియాలి. అయితే ఇక నా పరుగును ఎవ్వరూ ఆపలేరంటోంది. రాబోయే తెలుగు సినిమాలు నా గత వైభవాన్ని తెచ్చిపెడతాయి అని ఘంటాపథంగా చెబుతోంది. ఆమె తాజా చిత్రం ‘క్రాక్‌’ లో పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొనే అంశాల‌తో, ఉద్వేగ‌భ‌రితమైన‌ క‌థ‌, క‌థ‌నాల‌తో స‌ర‌స్వ‌తి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు ‘క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మెర్సాల్‌’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రంతో  ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయని అంటోంది!?