Shruthi Haasan:మెగా#154 సినిమాకి రెమ్యునరేషన్ పెంచిన శృతి..?

Shruthi Haasan:క్రాక్ సూపర్ హిట్ తర్వాత శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం శృతి హాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తో హీరోయిన్ గా నటిస్తోంది.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమా కన్నడ తెలుగు భాషల్లో ఓకే కాలం లో తెరకెక్కుతుండడం విశేషం. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాబి కాంబినేషన్లో వస్తున్న మెగా 154 సినిమాలో హీరోయిన్ గా ప్రకటించారు.

ప్రస్తుత నందమూరి బాలకృష్ణ ,మెగాస్టార్ చిరంజీవి ఇతడు సినిమాలను హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేశారు. రెండు సినిమాల షూటింగ్ లు ఏకకాలంలో జరుగుతున్నాయి. కానీ ఈ రెండు సినిమాలకు తీసుకున్న పారితోషికంలో మాత్రం తేడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా కి 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకోగా, నందమూరి బాలకృష్ణ సినిమాకి ఏ మాత్రం1.5 కోటి తీసుకున్నట్టు సమాచారం. రెండు క్రేజీ ప్రాజెక్టులు అయిన రెండు సినిమాలకి రెమ్యూనరేషన్ లో ఎందుకు వ్యత్యాసం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే రెమ్యూనరేషన్ అనేది సినిమాను, ప్రొడక్షన్ హౌస్, దర్శకుడు, హీరో తో తనకున్న అటాచ్మెంట్ ను బట్టి హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు.గోపీచంద్ మ‌లినేనితో.. శ్రుతికి మంచి బాండింగ్ ఉంది. గోపీచంద్ గ‌త చిత్రాలు బ‌లుపు, క్రాక్‌ల‌లో శ్రుతినే క‌థానాయిక‌. సెంటిమెంట్ గా త‌న‌కు శ్రుతి బాగా క‌లిసొచ్చింది. శ్రుతికీ అంతే. అందుకే.. శ్రుతి కూడా బాల‌య్య‌తో సినిమా అన‌గానే పారితోషికం విష‌యంలో పెద్ద‌గా పేచీ పెట్ట‌లేద‌ని తెలుస్తోంది. చిరు సినిమాకొస్తే.. శ్రుతికి అలాంటి మొహ‌మాటాలేం లేక‌పోయేస‌రికి.. రూ.2 కోట్లు డిమాండ్ చేసింద‌ని, మైత్రీ మూవీస్ కూడా రూ.2 కోట్లు ఇవ్వ‌డానికి రెడీ అయిపోయింద‌ని, అందుకే ఈ సినిమా చేయ‌డానికి శృతిహాసన్ ఒప్పుకుందని సమాచారం.