అయ్యయ్యో పాపం కదూ :: సాయి పల్లవి మీద ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేసింది ఎవరు అసలు?

సహజసిద్దమైన నటన, ముద్దుముద్దుగా పలికే మాటలు, మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ నటి సాయిపల్లవి. అందుకే వరుస అవకాశాలు ఆమె తలుపుతడుతున్నాయి. నటనకు స్కోప్‌ ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ప్రస్తుతమున్న హీరోయిన్లలో సాయిపల్లవికి ఉన్నంత రెస్పెక్ట్‌, క్రేజ్‌ మరే హీరోయిన్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ల్లో(లవ్‌స్టోరి, విరాటపర్వం) నటిస్తున్నారు.

అయితే ఈ క్రేజీ నటికి సంబంధించి ఏదో ఒక రూమర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తమిళ సూపర్‌హిట్‌ ‘వేదాళం’ రీమేక్‌ అవుతన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చిరు చెల్లిగా సాయి పల్లవి నటించనుందని అనేక అనధికారిక వార్తలు వచ్చాయి. దీనిపై అటు చిత్రబృందం నుంచి గాని సాయి పల్లవి సైడ్‌ నుంచి గాని ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. చిరు చెల్లిగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలు వస్తున్న తరణంలో మరో వార్త సాయి పల్లవి అభిమానులను విసుగు తెప్పిస్తోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. బన్ని, రష్మిక మందనల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి సినీ పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కీలక పాత్ర పోషించనుంది అని తెలుస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలు పాత్ర పోషించడానికి డైరెక్టర్ సుకుమార్, సాయి పల్లవిని సంప్రదించాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడకుండా ఇలాంటి వార్తలు రావడం పట్ల ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవడం ఏంటని మరికొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.