షాకింగ్ : “భోళా శంకర్” కి లాస్ట్ మినిట్ చిక్కులు 

ఇపుడు టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి రానున్న లేటెస్ట్ చిత్రాల్లో బిగ్ రిలీజ్ అయినటువంటి చిత్రం “భోళా శంకర్” కూడా ఒకటి. మరి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ ఓ ముఖ్య పాత్రలో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రం ఇది.

అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కి ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. కానీ ఈ మధ్యలో మెగాస్టార్ కామెంట్స్ తో ఏపీలో సరికొత్త కాంట్రవర్సీ స్టార్ట్ కాగా ఈ కాంట్రవర్సీ మాత్రమే కాకుండా భోళా శంకర్ రిలీజ్ కి మరిన్ని లాస్ట్ మినిట్ చిక్కులు ఇప్పుడు ఎదురు కానున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే నైజాం లో అయితే భోళా శంకర్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కానీ ఏపీ లో మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు దీనితో ఈ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది ఆసక్తిగా మారగా ఇప్పుడు అయితే ఏదొక అడ్డంకి ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఇదిలా ఉండగా దీనితో పాటుగా నిన్న చెప్పినట్టుగా ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్ వేసిన కేసు విషయంలో కూడా కీలక తీర్పు కానీ వస్తే భోళా శంకర్ రిలీజ్ ఆగే అవకాశం ఉందని కూడా షాకింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఓ పక్క టికెట్స్ మరో పక్క రిలీజ్ ఆపేసే అవకాశం ఉందని వస్తున్నా వార్తలు ఇప్పుడు భోళా శంకర్ కి లాస్ట్ మినిట్ ట్విస్టులు గా మారే అవకాశం ఉందని చెప్పక తప్పదు. మరి ఏమవుతుందో చూడాలి.