పాపం..”విరూపాక్ష” డైరెక్టర్ కి చేదు అనుభవం.!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర సాలిడ్ హిట్ టాక్ తో అందరి నోట వినిపిస్తున్న సినిమా పేరు “విరూపాక్ష”. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ క్రేజీ థ్రిల్లర్ ని అయితే స్టార్ దర్శకుడు సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన యంగ్ దర్శకుడు కార్తీక్ దండు అయితే తెరకెక్కించాడు.

అయితే ఇది తనకి మొదటి సినిమా అయినా కూడా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకునిగా తాను వర్క్ చేయడం విశేషం. దీనితో తన వర్క్ కి అంతా ప్రశంసలు అందిస్తున్నారు. ఇక నిన్న మొదటి షో తోనే తన మొదటి సినిమా సెన్సేషనల్ టాక్ తెచ్చుకొని హిట్ కాగా పాపం తాను సినిమా రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామని ఓ థియేటర్ కి వెళ్ళాడట.

అలా వెళ్లిన తనకి ఆడియెన్స్ షాకిచ్చారట. అందులో ఎవరో కార్తీక్ దండు మొబైల్ ఫోన్ ని దొంగతనం చేసేసారట. పాపం తాను సినిమా హిట్ అయ్యిందని ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తనకి ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది.

మరి ఆ ఫోన్ అయితే ఇంకా దొరకలేదనే తెలుస్తుంది. ఇప్పుడు అయితే సూపర్ హిట్ టాక్ తో విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. రెండో రోజు మూడో వసూళ్లు మొదటి రోజు కన్నా ఎక్కువ ఉండొచ్చు అని కూడా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.