షాకింగ్ : ఆచార్య సెట్ లో అడుగు పెట్టబోతున్న కాజల్ ..?

టాలీవుడ్ లో 13 ఏళ్ళుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ వస్తోంది కాజల్ అగర్వాల్. కాగా రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ముంబై కి చెందిన వ్యాపారవేత్త గౌతం కిచ్లు ని వివాహం చేసుకుంది. చెప్పాలంటే కాజల్ వివాహం జరిగి కొన్ని గంటలు మాత్రమే అవుతోంది. అత్యంత వైభవంగా జరిగిన కాజల్ – గౌతం ల పెళ్ళి ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి కూడా.

Kajal Aggarwal Weds Gautam Kitchlu: Dreamy inside photos from their  fairytale wedding | Celebrities News – India TV

అలా పెళ్ళైందో లేదో కాజల్ అగర్వాల్ గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటంటే నవంబర్ మూడవ వారం నుంచి కాజల్ మళ్ళీ సెట్ లో అడుగు పెట్టబోతుందని. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అన్న సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవి కి జంటగా నటిస్తుంది.

కాగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయి దాదాపు 6 నెలలు కావస్తుంది. అయితే గత నెల నుంచి మళ్ళీ సినిమాలన్నీ సెట్స్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆచార్య సినిమా కూడా తిరిగి షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ క్రమంలోనే నవంబర్ మూడవ వారం నుంచి షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తుండగా ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ జాయిన్ కాబోతున్నారని సమాచారం. అంతేకాదు ఇప్పటికే సినిమా చాలా నెలలు గా ఆగిపోయింది కాబట్టి నిర్మాతలని దృష్టిలో పెట్టుకొని కాజల్ కూడా నవంబర్ మూడవ వారం నుంచి ఆచార్య సెట్ లో అడుగు పెట్టనుందని తెలుస్తుంది. నిజంగా ఇదే గనక జరిగితే అందరూ కాజల్ డెడికేషన్ కి ప్రశంసలతో మోసేస్తారనడం లో ఎలాంటి సందేహాలు ఉండవు.