“భారతీయుడు 2” కి శంకర్ పర్ఫెక్ట్ ప్లానింగ్స్.!

కోలీవుడ్ లో గత ఏడాది వచ్చిన ఇండస్ట్రీ హిట్స్ లో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా నటించిన సెన్సేషనల్ బాక్సాఫీస్ హిట్ సినిమా “విక్రమ్” కోసం తెలిసిందే. అయితే ఈ భారీ సినిమా తర్వాత అయితే కమల్ హాసన్ దీనికన్నా ముందే స్టార్ట్ చేసిన తన మాసివ్ అండ్ సెన్సేషనల్ సీక్వెల్ సినిమా “భారతీయుడు” ఉంది.

కానీ ఈ సినిమా అనుకోని కారణాల చేత మధ్యలోనే ఆగిపోవడం శంకర్ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. కానీ మళ్ళీ కొన్నాళ్ళకి నిర్మాతలు శంకర్ తో గొడవలు సెటిల్ చేసుకొని ఎట్టకేలకి సినిమా సెట్స్ లోకి శంకర్ ని రప్పించుకున్నారు. ఇక అక్కడ నుంచి శంకర్ అయితే ఎలాంటి లేట్ లేకుండా నాన్ స్టాప్ వర్క్ ఈ సినిమాకి చేస్తున్నారు.

కాగా ఈ భారీ సినిమా విషయంలో అయితే శంకర్ ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నట్టుగా కొన్ని ట్రస్టడ్ సినీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు బ్రిస్క్ పేస్ లో కొనసాగుతూ ఉండగా ఎలా లేదన్నా జులై చివరికి షూటింగ్ శంకర్ పూర్తి చేయనున్నారట.

అలాగే అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి కోలీవుడ్ ఫేవరెట్ ఫెస్టివల్ సీజన్ దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట. మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో శంకర్ ఫుల్ క్లారిటీ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ మొత్తంలో 500 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.