భార‌తీయుడు 2 ప‌ట్టాలెక్క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు చిత్రం చ‌రిత్ర తిర‌గ‌రాసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న్. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా శంక‌ర్ ఇండియ‌న్ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఇందులోను క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, ఈ మూవీ సెట్‌లో ఇటీవ‌ల ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కుప్ప‌కూల‌డంతో ముగ్గురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు .

సినిమా షూటింగ్ జరుగుతుండగా 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడి అక్కడే ఉన్న టెంట్‌పై పడడంతో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాజ‌ల్‌, శంకర్ కూడా అక్క‌డే ఉండ‌గా, వారు పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నారు.ఈ ఘ‌ట‌న జ‌రిగిన తర్వాత చిత్ర షూటింగ్ కొంచెం కూడా ముందుకు సాగ‌డం లేదు. శంక‌ర్‌కు నిర్మాత‌ల‌కు మ‌ధ్య నెల‌కొన్న వైరంతో షూటింగ్ ఆగింద‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు విజ‌య్ సేతుప‌తి, య‌ష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న సినిమా కోసం భార‌తీయుడు 2 చిత్రాన్ని వాయిదా వేసారంటూ చెప్పుకొచ్చారు.

భార‌తీయుడు 2 చిత్రం వాయాదా ప‌డ‌డానికి గ‌ల కార‌ణం ఒక‌టి ఇప్పుడు కోలీవుడ్ నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న పెద్ద‌కూతురు అదితి పెళ్లి ప‌నుల‌లో బిజీగా ఉండడం వ‌ల‌న భారతీయుడు 2కు తాత్కాలిక బ్రేక్ వేశార‌ట‌. పెళ్ళైన త‌ర్వాత ఈ చిత్ర షూటింగ్‌ని శ‌ర‌వేగంగా జ‌రుపుతార‌ని టాక్. శంక‌ర్ – ఈశ్వ‌రి దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుళ్లు అదితి శంక‌ర్, ఐశ్వ‌ర్య శంక‌ర్‌ల‌తో పాటు కుమారుడు అర్జిత్ ఉన్నారు.