రానా తమ్ముడికి అవమానం

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్, రానా తర్వాత ఇప్పుడు మూడో హీరోగా అభిరామ్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు తేజ అతనిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. ఇక అభిరామ్ ని హీరోగా పరిచయం చేయడానికి తేజ మరల తన పాత స్టైల్ లోకి వెళ్ళిపోయి లవ్ స్టొరీని తీసుకున్నారు. అలాగే ప్రేమికులు ఎదుర్కొనే కష్టాలని తెరపై చూపించారు. ఇలాంటి మూసకథలని ప్రేక్షకులు ఆదరించడం ఎప్పుడో మానేసారు.

అయితే ఎందుకనో కథలో ఎమోషన్ ఉంటే ప్రేక్షకులకి కనెక్ట్ అయిపోతుందని భావించిన తేజ అహింస టైటిల్ తో అభిరామ్ తో సినిమా చేశాడు. సినిమాలో మాత్రం చాలా హింసని చూపించాడు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక దర్శకుడు తేజ ఈ సినిమా కోసం తన పాత టీమ్ ఆర్పీ పట్నాయక్, కెమెరామెన్ గా సమీర్ రెడ్డిని తీసుకున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక టీజర్ ని రిలీజ్ చేసి మూవీపై హైప్ క్రియేట్ చేయాలని అనుకున్నారు.

అయితే టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదని తెలుస్తుంది. కొత్త హీరో మీద చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టారని టాక్. అయితే అభిరామ్ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమాని చూస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే సురేష్ బాబుకి కొడుకు సినిమాని లాభంతో సంబంధం లేకుండా తానే రిలీజ్ చేసుకోవచ్చు.

కాని ఆ దిశగా కూడా అతను ప్రయత్నం చేయలేదు. అలాగే రానా కూడా పెద్దగా సపోర్ట్ చేయడం లేదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఈ నేపధ్యంలో అహింస సినిమాకి ఇప్పుడు రిలీజ్ కష్టాలు వచ్చాయని తెలుస్తుంది. కథని నమ్మి అభిరామ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతని దర్శకుడు తేజ తీసుకున్నా కూడా అతనిని ప్రేక్షకులకి రీచ్ చేయడంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి.