‘విరూపాక్ష’ సీక్వెల్.! త్వరలోనే.. అతి త్వరలోనే.!

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ కాంబినేషన్‌లో కార్తీక్ దండు తెరకెక్కించిన ‘విరూపాక్ష’ సినిమా అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది. మెగాభిమానులు ఈ సినిమాని ఓ చాలెంజ్‌గా తీసుకున్నారా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో.!

మరోపక్క, యంగ్ టైగర్ ఎన్టీయార్ దగ్గర్నుంచి, టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరి అభిమానులూ ‘విరూపాక్ష’ సినిమాకి పాజిటివ్‌గానే వ్యవహరిస్తున్నారు. అందుక్కారణం, సాయి ధరమ్ తేజ్ అందరు హీరోలతోనూ సఖ్యతగా వుండడమే.

అయితే, ఆ సన్నిహిత సంబంధాలే సినిమా సక్సెస్‌కి కారణమని చెప్పడమూ జబబు కాదు. కాగా, ‘విరూపాక్ష’ సీక్వెల్ ఆలోచనలు, సినిమా విడుదలకు ముందే ఓ కొలిక్కి వచ్చాయట.

ఫస్ట్ ఔట్‌పుట్ చూసుకున్నాక, సీక్వెల్ విషయమై టీమ్ సుదీర్ఘంగా చర్చించిందట. అన్నీ అనుకూలిస్తే, త్వరలోనే సీక్వెల్‌ని అనౌన్స్ చేసే అవకాశాలూ లేకపోలేదు. సీక్వెల్ దిశగా సినిమా ఎండింగ్‌లో అవకాశం కూడా చూపించేశారు.