కొంచెం దయ చూపవయ్యా మహేషా..!

mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు కెరీర్ మొదట్లో విజయాలను అందుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. అప్పుడు ఫామ్ లో ఉన్న అగ్ర దర్శకులతో సినిమా చేసినా కూడా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఒక్కడు సినిమా తరువాతే మహేష్ రేంజ్ ఒక్కసారిగా అకాశాన్ని తాకింది. ఇక చాలా కాలం తరువాత వరుస అపజయల్లో ఉన్నప్పుడు కాపాడింది దూకుడు సినిమా.

mahesh

ఒక్కడు, దూకుడు కంటే పెద్ద విజయాలు మహేష్ కెరీర్ లో ఉన్నప్పటికి ఈ రెండు సినిమాలు మాత్రం క్లిష్టమైన పరిస్థితుల్లో విజయన్ని అంధించాయి. పోకిరి తరువాత 5ఏళ్ల వరకు సక్సెస్ లేకపోతే శ్రీను వైట్ల దూకుడు సినిమాతోనే మహేష్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ఒక్కడు డైరెక్టర్ గుణశేఖర్ తో అప్పట్లో అర్జున్, సైనికుడు అంటూ మళ్ళీ వర్క్ చేశారు. కానీ ఆ రెండు సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక శ్రీను వైట్ల దూకుడు అనంతరం చేసిన ఆగడు అయితే డిజాస్టర్.

మహేష్ తనకు హిట్టిచ్చిన దర్శకులతో వర్క్ చేయడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు ఏ మాత్రం తేడా కొట్టినా కూడా వర్కౌట్ కావడం లేదు. సినిమా నష్టపోతే నిద్రపట్టదని అందుకే నమ్మకం కలిగే వరకు రిస్క్ చేయనని మహేష్ చెబుతూ ఉంటాడు. ఇక శ్రీను వైట్ల, గుణశేఖర్ గత ఏడాది నుంచి మహేష్ కు కథ చెప్పి ఒప్పించాలని ట్రై చేస్తున్నారాట. మహేష్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు శ్రీను వైట్ల ఢీ2తో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. మరి వారి సినిమాలు హిట్టయిన తరువాత అయినా మహేష్ దయ చూపిస్తాడో లేదో చూడాలి.