తెలుగు సినిమా రంగంలో మరోసారి నయనతార పారితోషికం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల చిరంజీవి నటించనున్న భారీ చిత్రానికి నయనతారను కథానాయికగా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా, ఆమె రూ.18 కోట్లు రెమ్యునరేషన్గా కోరినట్టు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో ఇదే అత్యధిక పారితోషికంగా నిలిచే అవకాశం ఉండడంతో, ఈ డిమాండ్ సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ను టచ్ చేసిన నయనతారకు అక్కడి నుంచి భారీ గుర్తింపు లభించింది. షారుఖ్ ఖాన్తో కలిసి నటించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలవగా, ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. అప్పటినుంచి నయన్ పారితోషికంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్లో గతంలో ‘సైరా’, ‘గాడ్ఫాదర్’ చిత్రాల్లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసిన నయనతార.. మళ్లీ మెగాస్టార్తో కలవబోతుందా అనే ఆసక్తి ఉంది.
ఇదిలా ఉండగా, నయనతార తాజా సినిమాలు ‘అన్నపూర్ణి’, ‘టెస్ట్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా.. ఆమె క్రేజ్ తగ్గలేదని ఈ రెమ్యునరేషన్ డిమాండ్ సూచిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లైన తర్వాత కూడా కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఆమె, తన మార్కెట్ విలువను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా అడుగుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
నిర్మాతల వైపు నుంచి అధికారిక ప్రకటన రాలేకపోయినా, నయనతార డిమాండ్ విషయంలో చర్చలు జరగడం ఖాయమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఈ డిమాండ్ మేరకే పారితోషికం కట్టినట్లయితే, అది దక్షిణాది చిత్రసీమలో మహిళా నటులకు ఓ మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ అంశంపై ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.