మరీ అంతలా కక్కుర్తి పడ్డారా.?

పూజా హెగ్దే ఔట్.. శ్రీలీల ఇన్.! ఇంతవరకూ బాగానే వుంది. మధ్యలో మీనాక్షి చౌదరి ఎలా వచ్చిందబ్బా.? అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా గురించే ఇదంతా. అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్దే తప్పకుంది. ఈ సినిమాలో అప్పటికే మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. పూజా హెగ్దే తప్పుకోవడంతో.. శ్రీలీలకి ప్రమోషన్ లభించింది.

తాజాగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. వాస్తవానికి పూజా హెగ్దే తప్పుకుంటే, ఆ స్థాయి వున్న హీరోయిన్‌ని కదా తీసుకోవాలి.? శ్రీలీలతో ఎలా ఆ గ్యాప్‌ని ఫిల్ చేసినట్టు.? పోనీ, శ్రీలీల స్టార్‌డమ్ బాగానే వుందనుకోండి.. మీనాక్షి పరిస్థితేంటి.?

బాగా లోబించారు.. అన్నది ‘గుంటూరు కారం’ గురించి ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. ఛ.. మరీ అంతలా ఎలా లోబిస్తారు.? అనేవారూ లేకపోలేదు. ఇంతకీ, రెమ్యునరేషన్ దగ్గర కక్కుర్తి పడ్డారా.? అది నిజమేనా.?