“గుంటూరు కారం”కి సెకండ్ హీరోయిన్ ఆలోచనలు.?

రీసెంట్ గా టాలీవుడ్ లో యమ హాట్ టాపిక్ గా వినిపిస్తున్న సినిమా పేరు “గుంటూరు కారం” సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు త్రివికం తెరకెక్కిస్తుండగా ఈ పరిస్థితి అటు ఇటు కాకుండా పోయింది. త్రివిక్రమ్ మొదటి సారి ఇంత కన్ఫ్యూజ్ గా చేస్తున్న సినిమా కూడా ఇదే అని చెప్పొచ్చు.

ఇప్పటికే కథ మార్చి తెరకెక్కించిన సీన్స్ స్క్రాప్ లో వేసేసి ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే ని కూడా పక్కన పెట్టేసారు. దీనితో ఈ చిత్రం పూర్తిగా వింతగా మారిపోయింది. దీనితో గుంటూరు కారంలో ఘాటు తగ్గిపోతుంది అని ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు.

ఇక పూజ హెగ్డే ని హీరోయిన్ గా తప్పించడం కన్ఫర్మ్ కాగా నెక్స్ట్ ఈ చిత్రంలో అయితే యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాడ్ అవుతుంది ని లేటెస్ట్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా ఈ చిత్రంలో అయితే సంయుక్త రావడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది.

అయితే మెయిన్ హీరోయిన్ గా మాత్రం మరో యంగ్ లేడీ శ్రీ లీల మాత్రమే ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే మళ్లీ ఇద్దరు హీరోయిన్స్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ ని సమాచారం, కాగా ఈ చిత్రం కొత్త షెడ్యూల్ అండ్ లాంగ్ షెడ్యూల్ ఈ జూన్ 24 నుంచి స్టార్ట్ కానుండగా వచ్చే  ఏడాది జనవరి 13న అనుకున్న డేట్ కి రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.