Manjula Ghattamaneni: వారి ప్రేమకథను మర్చిపోలేం అంటూ.. సమంత నాగచైతన్యల గురించి చెప్పుకొచ్చిన ఘట్టమనేని మంజుల..!

Manjula Ghattamaneni: తెలుగు ప్రేక్షకులకు ఘట్టమనేని మంజులతో అంతగా ర్యాపో లేకపోవచ్చు. కానీ స్టార్ హీరో మహేష్ బాబు సోదరి అంటే ఎవరైనా ఇట్లే గుర్తుపడతారు. ‘మనసుకు నచ్చింది’ సినిమా దర్శకత్వం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోని అడుగు పెట్టిన ఈమే. ఆపై పలు సినిమాల కు ప్రాణం పోసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక మంజులకు పెద్దగా గుర్తింపు తెచ్చిన సినిమాలలో చూపించు, పోకిరి ఈ సినిమాలకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం, నంది అవార్డు కూడా గెలుచుకుంది.

ఇదిలా ఉంటే సమంత, నాగ చైతన్యల ఏమాయ చేసావే చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలుసు. ఈ సినిమా ఇప్పటికీ చాలామందిలో అలానే ఉండిపోయింది. జెస్సీ కార్తీక్ ల ప్రేమ కథకు ప్రేక్షకులు వేరే స్థాయిలో ఫిదా అయ్యారు. ఇక ఇదే విషయాన్ని ఘట్టమనేని మంజుల చెప్పుకొచ్చింది. ఏ మాయ చేసావే సినిమా వచ్చి దాదాపు 12 ఏళ్లు పూర్తయింది. అంటే సమంతకు నటిగా 12 ఏళ్ళు వచ్చాయి అనమాట. అంటూ ఘట్టమనేని మంజుల తన ఇంట ఖాతాలో ఒక ఒక పోస్ట్ ను పంచుకుంది.

ఈ పోస్టుకు సెలబ్రిటీల నుంచి నార్మల్ పీపుల్స్ వరకు అందరూ కంగ్రాట్స్ తెలియ చేసారు. ఇక ఈ పోస్ట్ పంచుకుని ఇరవై రెండు గంటల పూర్తికాగా 3,333 ఇష్టాలను పొందింది. ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్లు మరొకసారి ఏ మాయ చేసావే చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకొని తమ మనసుకు అనిపించిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మంజుల ఘట్టమనేని వ్యక్తిగత విషయానికొస్తే.. ఆమె సీనియర్ నటుడు కృష్ణ అతడి మొదటి భార్య ఇందిరాదేవి రెండవ కుమార్తె. ఆమెకు ఇద్దరు సోదరులు ఆమె అన్నయ్య రమేష్ బాబు. ఇక ఆమె తమ్ముడు మహేష్ బాబు మనకు తెలుసు. మంజుల నిర్మాత, నటుడు సంజయ్ స్వరూప్ ను వివాహం చేసుకుంది. ఇక వీరిరువురికి జువ్వి అనే కూతురు కూడా ఉంది.