‘శశివదనే’ నుంచి పాట విడుదల!

‘పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్న రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శశివదనే’. కోమలి ప్రసాద్‌ కథానాయికగా నటిస్తోంది. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేని దైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అంటూ హృదయాన్ని హత్తుకునే గ్రామీణ నేపథ్యంలో ప్రేమ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పాటలు, టీజర్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఈ సినిమా నుంచి ‘ఏమిటో ఏమిటో..’ అనే పాటను విడుదల చేశారు. హీరోయిన్‌పై మనసుపడ్డ హీరో తన మనసులో చేలరేగే భావాలను పాట రూపంలో వ్యక్తం చేసే క్రమంలో పాట వచ్చే సందర్భంగా అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్‌ వరకు ఆగాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. పి.వి.ఎన్‌.ఎస్‌.రోహిత్‌ పాడిన ఈ పాటను కరుణాకర్‌ అడిగర్ల రాశారు. శరవణ వాసుదేవన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

రైటర్‌, డైరెక్టర్‌ సాయి మోహన్‌ ఉబ్బన సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన మూవీ కంటెంట్‌తో.. ఈ ప్రేమకథా చిత్రంలో గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రంలో రంగస్థలం మహేష్‌, శ్రీమాన్‌, జబర్దస్త్‌ బాబీ, ప్రవీణ్‌ యండమూరి మరియు దీపక్‌ ప్రిన్స్‌ కీలక పాత్రలు పోషించారు.