కీర్తి సురేష్ కి వెల్కం చెప్పిన “సర్కారు వారి పాట” ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కబోతుంది ‘సర్కారు వారి పాట’. సరిలేరు నీకెవ్వరు వంటి భారీ కమర్షియల్ సక్సస్ తర్వాత మహేష్ నుంచి రాబోతున్న ఈ సినిమా మీద టైటిల్ పోస్టర్ తోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.

Saaho eyes for Sarkaru Vaari Paata - tollywood

కాగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇన్నాళ్ళు సస్పెన్స్ గా ఉండింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్సైందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికి చిత్ర యూనిట్ మాత్రం అధికారకంగా వెల్లడించలేదు. కీర్తి కూడా సర్కారు కి డేట్స్ ఇచ్చినట్టు వెల్లడించింది. కాని..ఇప్పుడు తాజాగా ‘సర్కారు వారి పాట’ మేకర్స్ నుంచి హీరోయిన్ గురించి ఆఫీసియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రోజు కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమాకి టాలెంటెడ్ యాక్ట్రెస్ ని తీసుకున్నట్లు అధికారకంగా ప్రకటించారు.

Superstar says grand welcome to 'Mahanati' ...!

ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ”సూపర్ టాలెంటెడ్ కీర్తి సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కారు వారి పాట’ టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఇది మీ మరపురాని చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది” అని తెలిపాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు పరశురామ్ తో పాటు నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు ‘మహానటి’ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు పెంగ్విన్, గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా, రంగ్ దే, అన్నాత్తే లాంటి భారీ కమర్షియల్ సినిమాలలో నటిస్తోది.

కాగా సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ 2021 జనవరి నుంచి ప్రారంభం అవుతుందన్న సమాచారం. ఇప్పటికే అమెరికాలో లొకేషన్ ని ఫైనల్ చేసుకున్నారు. వాస్తవంగా ఈ నవంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకి వెళ్ళాల్సి ఉండగా యూనిట్ లో కొంతమందికి విసా సమస్య రావడంతో జనవరికి షూటింగ్ పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తుండగా 7 ఏళ్ళ తర్వాత మహేష్ – థమన్ కాంబో రిపీటవుతోంది.