Mahesh : విడుదలకు ముందే లాభాల బాటలో సర్కారు వారి పాట సినిమా…!

Mahesh: వరుస హిట్ సినిమాలతో ఉన్న మహేష్ బాబు నుంచి రాబోతున్న మరో సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్,ఇంకా జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా కీర్తి సురేష్ మొదటిసారిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. కళావతి సాంగ్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు వరుస హిట్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాల సమయమే ఉండటంతో సినిమా హక్కుల అమ్మకం కూడా మొదలైంది. థియరిటికల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం నైజాం ఏరియా కు సంబంధించిన థియరిటికల్ హక్కులను జీఎస్టీ తో కలిపి రూ.30 నుండి 35 కోట్ల రూపాయలకు కోనుగోలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర ఏరియా కు సంబంధించిన థియరిటికల్  హక్కులు రూ.50 నుంచి 60 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్ నడుస్తోంది.

సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఇంత బిజినెస్ జరగడంతో అభిమానులలో సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే ఇంత మొత్తం చెల్లించి ఆ హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఏదైనా అయితే తమ పరిస్థితి ఏంటి అని మూవీ మేకర్స్ ను ప్రశ్నించడం కూడా జరిగిందట. దీనికి సమాధానంగా చిత్ర బృందం సినిమా చాలా బాగా వచ్చిందని ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా తాము అండగా ఉంటామని డిస్ట్రిబ్యూటర్స్ కు హామీ కూడా ఇచ్చారట. అంతేకాకుండా తమిళ వెర్షన్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడు పోయే అవకాశం కూడా ఉందట. ఇక ఓవర్సీస్ కింగ్ గా ఉన్న మహేష్ బాబు సినిమాకి రూ. 150 నుండి 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని సమాచారం.