‘సరిపోదా శనివారం’ 29న విడుదల.. సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన

నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ .. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా మూవీ ప్రమోషన్స్‌ చేస్తుంది.

అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్నట్లు నాని సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా వదిలాడు.’సరిపోదా శనివారం’ సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సెన్సార్‌ బోర్డ్‌ యు /ఏ సర్టీఫికెట్‌ ఇచ్చింది. అలాగే 2 గంటల 35 నిమిషాలు రన్‌ టైం అని నాని చెప్పగా.. వెనక నుంచి ఎస్‌జే సూర్య వచ్చి ప్లస్‌ 15 మినిట్స్‌ అంటాడు. మొత్తం 2 గంటల 50 నిమిషాలు అంటే సుందరానికి కూడా ఇదే రన్‌ టైం కదా అంటూ ఎస్‌జే సూర్య అనగా.. అంటే కాదు..’సరిపోదా శనివారం’ అంటూ నాని అనడం ఇది ఒక యాక్షన్‌ మూవీ అండ్‌ లవ్‌ స్టోరీ అంటూ వీడియోను వదిలారు.