రామ్ కోసం.. రంగంలోకి సంజయ్ దత్?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని మరోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ సరిపోయే విధంగా దానికి సీక్వెల్ తో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ చేశారు.

అయితే సినిమాలో పూర్తిస్థాయిలో నటీనటులను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. ముందుగా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఆ పనులను తర్వాత ఫైనలైజ్ చేసుకోవాలని పూరి తనదైన శైలిలో ఒక ప్రణాళిక అయితే రచించాడు. ఇక సినిమాకు హీరోయిన్ ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ నుంచి బ్ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

ఇక ఇప్పుడు మరొక ఆసక్తికరమైన టాక్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను అనుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు అయిన 10 కోట్ల రెమ్యునరేషన్ కూడా అడిగారట. అందుకు పూరి ఛార్మి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అధికారికంగా క్లారిటీ రానున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్ విషయంలో కూడా స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.